అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు…

అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు.

“నేటిధాత్రి”,హన్మకొండ/ప్రెస్ క్లబ్

 

వరంగల్ ప్రెస్ క్లబ్ గత34 సంవత్సరాలుగా1992 నుండి నిర్వహిస్తున్న హోళి వసంత కేళి రంగుల మహోత్సాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది.
దేశంలో ఏ ప్రెస్ క్లబ్ నిర్వహించని ఈ వేడుకలను కేవలం వరంగల్ ప్రెస్ క్లబ్ మాత్రమే నిర్వహించడం గొప్ప విశేషం..
నాడు ప్రెస్ క్లబ్ పెద్దలు అటు అధికారుల ఇటు ప్రజా ప్రతినిధుల మధ్య పరిచయమే వారధిగా చిన్న పెద్ద జర్నలిస్టు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమానికి నాంది పలికింది….
అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ప్రస్తుత నిర్వహక మండలి మంగళవారంనాడు హోలీ పండుగ వేల యూనియన్లకు అతీతంగా భాగస్వామ్యం అయ్యి సప్తవర్ణ రంగుల కలయిక ఇంద్రధనస్సును తలపింపచేసింది…

డిజె సౌండు మధ్య ఉదయమే కలం కార్మికమిత్రులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోళీ వేడుక నిర్వహించారు..
అనంతరం అల్పాహార కార్యక్రమం అనంతరం రేన్ డాన్స్ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు అత్యంత వైభవంగా తమ న్రుత్య శైలిని చాటారు..జర్నలిస్టు సోదరుల పిల్లలు మనలో మమేకమైనారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల పి.వి.మదన్ మోహన్,ప్రధాన కార్యదర్శి సదయ్య,కోశాధికారి అమర్, ఉపాధ్యక్షులు గోకరపు శ్యామ్, బోడిగ శ్రీనివాస్, కోడిపెల్లి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు పెద్దపల్లి వరప్రసాద్, సంపేట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, పొడి శెట్టి విష్ణువర్ధన్, సీనియర్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, వీర గొని హరీష్, జనగాని ఆంజనేయులు, దొమ్మటి శ్రీకాంత్, నన్నపనేని భరత్,మురళి
హరి,శ్యాం,విష్ణు,
, షఫీ,
వంశీ,క్రిష్ణ,బుచ్చి రెడ్డి,కిషన్, రోజనాల సీను,రవీందర్ రెడ్డి, హరీష్,వెంకన్న,
భాస్కర్,
ప్రముఖులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version