నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి…

నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

మున్సిపల్ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న అర్పిలకు మరియు ఎస్ఎల్ఎఫ్ లకు అక్షరాస్యత కార్యక్రమం అమలులో భాగంగా ఉల్లాస్-అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలలో ఉన్న నిరక్షరాస్యులను 10 మందిని గుర్తించి సంఘ పరిధిలో ఉన్నఒక వాలంటరీని ఎంపిక చేసి నిరక్షరాస్యులైన వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి వారిని అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్.కన్నం నారాయణ,మున్సిపల్ కమిషనర్ అంజయ్య,మెప్మా టిఎంసి సతీష్,సిఆర్పిలు ఎండి.జమీల బేగం,ప్రియదర్శిని,డీఎల్ఎఫ్ అధ్యక్షురాలు సాదు.నాగరాణి,కార్యదర్శి శ్యామల,కోశాధికారి,సునీత టిఎల్ఎఫ్ ఆర్పి రుక్మిణి,ఎస్ఎల్ఎఫ్,ఓబిఎస్ మరియు ఆర్పిఎస్ అమరావతి,అనురాధ,రత్న సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version