కౌన్సిలర్ గా గెలిపియండి సేవకురాలిగా పనిచేస్తా…

కౌన్సిలర్ గా గెలిపియండి సేవకురాలిగా పనిచేస్తా

భూపాలపల్లి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఉడుత సరోజన రాజమల్లు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తానని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాజమల్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. ఉచిత బస్సు, మహిళలకు రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, వంటగ్యాస్ పై సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేదింటి అభివృద్ధికి చేయూతగా ఉంటోందన్నారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version