టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా అద్యక్షులు తాడగోని రాజు

పరకాల నేటిధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా తృతీయ మహాసభలు
ఈనెల 13 తేదీన హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరుగనున్నాయని జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని టిడబ్ల్యూజేఎప్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తడగోని రాజు పిలుపునిచ్చారు.మంగళవారం అమరాదామంలో మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా గూడెల్లి నాగేంద్ర అద్యక్షతన జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో గత బిఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.అదికారంలోకి వచ్చే ముందు జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదంటు విమర్శించారు.రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సైతం నెల కొంటున్నాయంటు ఆవేదన వ్యక్తం చేశారు‌.ఈలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునారావృతం కాకుండా సమర్దవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు జర్నలిస్టు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరంఉందన్నారు.జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం జిల్లా మహాసభలకు ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజెఎఫ్ జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్,దామెర రాజేందర్,కోగిల చంద్రమౌళి,ఏకు రవికుమార్,సిలువేరు రాజు,దేవు నాగరాజు,నాగెల్లి సంతోష్,చుక్క సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version