సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు..

సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

క్రమశిక్షణతో కూడిన లక్ష్యసాధన ఉంటే ఎంతటి విజయమైన సాధ్యమైతుందని ప్రైవేట్ (ట్రస్మా )స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి, విజ్ఞాన భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ బీ జంగారెడ్డి అన్నారు. జిల్లా స్థాయిలో జరిగినటువంటి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజ్ఞాన భారతి పాఠశాల తుంకుంట విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో బుధవారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అండర్ -14 లాంగ్ టెన్నిస్ లో పి.ఆంజలీనా, ఏ.రాజీవ మైత్రి అండర్- 16 వెయిట్ లిఫ్టింగ్ లో, బి రుద్ర ఆదిత్య, అండర్ -18 కోకోలో వి.హేమలత, జి నిహారిక లు రాష్ట్ర స్థాయి లో జరిగే సీఎం కప్ టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోనే సంగీత, పిఈటీ మహేష్ పాల్గొన్నారు.

ట్రస్మా జహీరాబాద్ అధ్యక్షులుగా కే శ్రీశైలం…

ట్రస్మా జహీరాబాద్ అధ్యక్షులుగా కే శ్రీశైలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ ట్రస్మా( తెలంగాణ రికగ్నైజేడు స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్యక్షులుగా కె. శ్రీశైలం( శ్రీ నారాయణ హై స్కూల్ ప్రిన్సిపాల్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రాత్రి శ్రీ నారాయణ హై స్కూల్ లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో జహీరాబాద్ అధ్యక్షులుగా కె. శ్రీశైలం, కోశాధికారులుగా కె. శేఖర్ రెడ్డి (సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపాల్) ఎండి అసిఫ్ (సన హైస్కూల్ ప్రిన్సిపల్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ అన్ని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు రాఘవేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, జహీరాబాద్ మాజీ అధ్యక్షులు జి మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి మరియు అన్ని పాఠశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు,

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం…

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల్ లోని ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయ బృందాన్ని జహీరాబాద్ ట్రస్మ తరఫున ఉపాధ్యాయులందరినీ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులందరిని సన్మాన సత్కారము జరుపబడుతుంది అదేవిధంగా ఈసారి కూడా ప్రతి పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ లను సన్మాన సత్కారము చేయబడింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్దలు ట్రస్మా ప్రెసిడెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ ల
కరస్పాండెంట్లు విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ నాగన్న అక్షర భారతి కరస్పాండెంట్ శ్రీనివాస్ మరియు హాని టెక్నో పాఠశాల కరస్పాండెంట్ శరణప్ప ట్రస్మా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి దశరథ్ రెడ్డి మరియు సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version