బోర్నపల్లి -కిష్టంపేట చలివాగులో అక్రమ వసూలు…

బోర్నపల్లి -కిష్టంపేట చలివాగులో అక్రమ వసూలు

అక్రమ టోల్ టాక్స్ రద్దు చేయాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

మండలంలోని బోర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్యలో ఉన్న చలివాగుపై కొంతమంది అక్రమార్కులు టోల్ టాక్స్ పేరిట అక్రమ వసూల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది చలివాగులో రోడ్ నిర్మాణం చేసి అట్టి రోడ్డు పై నుండి ప్రయాణం చేసే వాహనానికి ఒక రేటు వారే నిర్ణయించుకుని, టోల్ టాక్స్ పేరిట డబ్బులు వసూల్ చేస్తున్నారని, ఇదేంటని అడిగిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని,ఇంత దందా జరుగుతున్న సంబందిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ టోల్ టాక్స్ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version