అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

నేడంతా డిజిటల్ మయమే..

సమస్యలపై సంఘటితంగా పోరాడుదాం.

ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్..

డిజిటల్ మీడియా ఎడిటర్స్ కార్యవర్గం ఎన్నిక..

“నేటిధాత్రి”, హనుమకొండ.

డిజిటల్ మీడియా అని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, 

అన్ని పత్రికలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే ఆశ్రయిస్తున్నాయని వరంగల్ డిజిటల్ మీడియా ఎడిటర్లు అన్నారు.

సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్ల సమావేశం వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా డిజిటల్ పేపర్లకు రాజకీయంగా, ప్రభుత్వ అధికారుల నుంచి రావాల్సిన గుర్తింపుపై చర్చించారు.

మనం ఉన్నది ఆశించే స్థాయిలోకాదని, శాసించే స్థాయిలో ఉన్నామన్నారు.

అన్ని పత్రికల్లా మనం కూడా ప్రభుత్వ, రాజకీయ, ప్రజల సమస్యలపై కథనాలు ఇస్తున్నామని చెప్పారు.

రానున్న రోజుల్లో అన్ని పేపర్లు డిజిటల్ వైపే చూస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్ సంఘానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం సలహదారులుగా “నేటిధాత్రి” ఎడిటర్ కట్ట రాఘవేందర్ రావు , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, ఉపాధ్యక్షులుగా స్పాట్ వాయిస్ ఎడిటర్ చేలిక రాజేంద్రప్రసాద్, అక్షరశక్తి ఎడిటర్ పల్లె రవివంశీమోహన్, ఘంటారావం ఎడిటర్ బొల్లెపల్లి.

కిషన్, ప్రధాన కార్యదర్శిగా అక్షరదర్భార్ ఎడిటర్ వేముల రాజేశ్వర్ రావు, సహాయ కార్యదర్శులుగా జననిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, మన కలం ఎడిటర్ సుంకరనేని నర్సయ్య, అక్షర సవాల్ ఎడిటర్ బాదవత్ బాలాజీ నాయక్, సంస్కృతిక కార్యదర్శిగా ఎడిటర్ యాంసాని శ్రీనివాస్, ట్రెజరరీగా కౌడగాని మోహన్ రావు, మీడియా ఇన్ చార్జ్ గా స్పాట్ వాయిస్ నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా రావుల రాజేశం, లింగబత్తిని కృష్ణ, సంపతి ప్రభాకర్ రావు, దాసరి మధు సూదన్, వక్కల వెంకటస్వామి, చల్లా రాజిరెడ్డి, కోల జనార్దన్, కే. కిరణ్, పెంచాల రాజును ఎన్నుకున్నారు.

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే.!

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే నీ సినిమా చరిత్రను తొక్కిపడేస్తాం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో
గుండాల మండల కేంద్రంలో
అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణబాబు మాట్లాడుతూ
ఆదివాసీల చరిత్రను విమర్శిస్తే నీ సినిమా చరిత్రను తలకిందులుగా పాతాళానికి తొక్కవలసి ఉంటుంది ఖబర్దార్ ఔరంగజేబు విజయ దేవరకొండ నీకు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమి తెలుసు ఈ ప్రపంచానికి ఐక్యతను సమైక్యతను సంస్కృతిని సాంప్రదాయాలను నేర్పింది ఆదివాసీలే ఆయుర్వేద మూలికల వైద్యంతోనే సైన్స్ రంగాన్ని పునాది వేసింది ఆదివాసీలే అంతెందుకు నువ్వు కూడా నీ అభివృద్ధి చెందిన జాతని చెప్పుకునే నువ్వు కూడా ఆదిమానవుల మూలాల నుంచే అభివృద్ధి చెందిన అని చెప్పుకునే అప్పర్ క్యాస్ట్ గా వచ్చావు నీ మూలాలు మర్చిపోయి నిన్ను నువ్వే విమర్శించుకునే స్థాయికి ఎదిగా ఉంటే నువ్వు అభివృద్ధి చెందినట్లు అభివృద్ధి అనే ముసుగు వేసుకున్నట్టు తెలుసుకో ముందు.
500 సంవత్సరాల క్రితం సేన్స్ లేకుండా ట్రావెల్స్ కొట్టుకున్నారని మీరు అన్నారు.ఓకే కానీ నాడు సెన్స్ లేకుండా కొట్టుకున్న ఆధిపత్యం గుంపు మేలు కోసం తగల లాభాల కోసం కొట్టుకున్నారు. డ్రైవర్స్ కానీ సైన్సు స్పేస్ రంగాలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో దేశాలు దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయో దాన్ని మీరు వివరించగలరా ఆఫ్ చేయగలరా
అది చేతగాని మీకు 500 సంవత్సరాల నాటి ఆదివాసీల ఐక్యతను చరిత్రను గురించి మాట్లాడే అర్హత లేదు నీకు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకుంటే నీ దిష్టిబొమ్మలను ప్రతి వాడలొ తగలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి గొగ్గెలా సుధాకర్, జబ్బా సుదర్శన్,ప్రశాంత్, సంపత్ ,రామ్మూర్తి,చింటూ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version