అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

నేడంతా డిజిటల్ మయమే..

సమస్యలపై సంఘటితంగా పోరాడుదాం.

ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్..

డిజిటల్ మీడియా ఎడిటర్స్ కార్యవర్గం ఎన్నిక..

“నేటిధాత్రి”, హనుమకొండ.

డిజిటల్ మీడియా అని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, 

అన్ని పత్రికలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే ఆశ్రయిస్తున్నాయని వరంగల్ డిజిటల్ మీడియా ఎడిటర్లు అన్నారు.

సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్ల సమావేశం వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా డిజిటల్ పేపర్లకు రాజకీయంగా, ప్రభుత్వ అధికారుల నుంచి రావాల్సిన గుర్తింపుపై చర్చించారు.

మనం ఉన్నది ఆశించే స్థాయిలోకాదని, శాసించే స్థాయిలో ఉన్నామన్నారు.

అన్ని పత్రికల్లా మనం కూడా ప్రభుత్వ, రాజకీయ, ప్రజల సమస్యలపై కథనాలు ఇస్తున్నామని చెప్పారు.

రానున్న రోజుల్లో అన్ని పేపర్లు డిజిటల్ వైపే చూస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్ సంఘానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం సలహదారులుగా “నేటిధాత్రి” ఎడిటర్ కట్ట రాఘవేందర్ రావు , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, ఉపాధ్యక్షులుగా స్పాట్ వాయిస్ ఎడిటర్ చేలిక రాజేంద్రప్రసాద్, అక్షరశక్తి ఎడిటర్ పల్లె రవివంశీమోహన్, ఘంటారావం ఎడిటర్ బొల్లెపల్లి.

కిషన్, ప్రధాన కార్యదర్శిగా అక్షరదర్భార్ ఎడిటర్ వేముల రాజేశ్వర్ రావు, సహాయ కార్యదర్శులుగా జననిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, మన కలం ఎడిటర్ సుంకరనేని నర్సయ్య, అక్షర సవాల్ ఎడిటర్ బాదవత్ బాలాజీ నాయక్, సంస్కృతిక కార్యదర్శిగా ఎడిటర్ యాంసాని శ్రీనివాస్, ట్రెజరరీగా కౌడగాని మోహన్ రావు, మీడియా ఇన్ చార్జ్ గా స్పాట్ వాయిస్ నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా రావుల రాజేశం, లింగబత్తిని కృష్ణ, సంపతి ప్రభాకర్ రావు, దాసరి మధు సూదన్, వక్కల వెంకటస్వామి, చల్లా రాజిరెడ్డి, కోల జనార్దన్, కే. కిరణ్, పెంచాల రాజును ఎన్నుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version