మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన

మాజీ జడ్పిటిసి మోటపోతుల శివ శంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్‌ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు.మృతదేహం ఈరోజు ఉదయం స్వంత గ్రామం వేలిశాలకు రాగా విషయం తెలుసుకున్న గణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పిటిసి మోట మోటపోతుల శివ శంకర్ గౌడ్ వేలిశాల గ్రామానికి వెళ్లి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సోదరుడు అయినటువంటి మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఐతు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. వారి వెంట గణపురం మండల కేంద్రానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version