నువ్వు బజారోడివి కాదు.. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు వైరల్….

నువ్వు బజారోడివి కాదు.. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు వైరల్

 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu).

AnilAnil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తూ ఉన్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించాడు. అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ ఉంటాయని, కామెడీ లేకపోయినా కుటుంబాలు మాత్రం బాగా కనెక్ట్ అవుతాయని ట్రోల్స్ వచ్చాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీలకు తప్ప యువతకు నచ్చలేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి సినిమాలు తీయడం ఆపేయ్ అనిల్ అని కూడా కామెంట్స్ చేశారు.ఇక ఆ సమయంలోనే ఒక మీమ్ వైరల్ అయ్యింది. అందులో ఒక కుర్రాడు సంక్రాంతికి వస్తున్నాం యావరేజ్ గురు అంటే.. పక్క కుర్రాడు అవును బావా.. ఫ్యామిలీకి ఎక్కేస్తుంది అని చెప్తాడు. వెంటనే మొదటి కుర్రాడు.. అంటే ఏంట్రా నేను బజార్ నా కొడుకుని అనుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతాడు. ఈ మీమ్ చాలా వైరల్ అయ్యింది. చివరికి అనిల్ సైతం ఈ మీమ్ చూసి నవ్వుకున్నట్లు తెలిపాడు.ఈ మీమ్ గురించి అనిల్ సరదాగా స్పందించాడు. ‘ ఫ్యామిలీ జోనర్ అంటే అందులో యంగ్ స్టర్స్ కూడా ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సమయంలో నేను బజారోడినా అనే మీమ్ చూసి తెగ నవ్వుకున్నాను. అరేయ్ బాబు నువ్వు కూడా ఫ్యామిలీయే.. నీ ఫ్యామిలీతో నువ్వు వెళ్ళినప్పుడు.. నీ తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలి నువ్వు కూడా ఉన్నావ్.. నువ్వు బజారోడివి కాదు. ఆ సినిమాలో మీనాక్షీకి యూత్ కనెక్ట్ అవుతారు.సీనియర్స్ చేయడం వలన కథ కనెక్ట్ కాకపోవచ్చు కానీ, ఫన్ ఎంజాయ్ చేస్తారుగా.నేను చిన్నప్పుడు అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలకు వెళ్లాను. ఆ సమయంలో నేను చిన్నోడిని.. నా పేరెంట్స్ పెద్దోళ్ళు కదా. నేను వాళ్ళతో వెళ్లి చూసాను కదా సినిమా. నాకు నాస్టాలీజియా ఫీలింగ్స్ కదా అవన్నీ. క్లీన్ మైండ్ తో తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. ఏ జోనర్ అయితే మీకెందుకు. అమ్మానాన్నలతో కలిసి సినిమా చూడు. వాళ్లకేం నచ్చిందో వాళ్ళు తీసుకుంటారు. నీకేం నచ్చిందో నువ్వు చూడు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంటే అందరూ వస్తారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

 అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

 

శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌.. క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికితీసి.. సరికొత్త ప్లేయర్లను క్రికెట్‌కు పరిచయం చేస్తుంది. శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్(WPL 2026) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ అనుష్క శర్మ(Anushka Sharma) తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 22 ఏళ్ల అనుష్క శర్మ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 63 బంతుల్లోనే 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఆడుతూ, అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.

వేలం నాటి నుంచే..

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం నాటి నుంచే అనుష్క శర్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.45లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క.. అక్కడ దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ ఇదే..

అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ సత్తా చాటింది.డొమెస్టిక్ వన్డేల్లో ఆమెకు 63 అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ ఉంది. మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్ల తరఫున ఆడిన అనుభవం ఉంది.

పెళ్లి తరువాత బాపు బొమ్మలా మెరుస్తున్న సామ్.. ఇంతందంగా ఉందేంట్రా…

పెళ్లి తరువాత బాపు బొమ్మలా మెరుస్తున్న సామ్.. ఇంతందంగా ఉందేంట్రా

 

పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట.SaSamantha: పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట. ప్రస్తుతం అందాల భామ సమంత (Samantha) కూడా అదే కోవలో చేరింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాకా.. సామ్ ముఖంలో లేని వెలుగు.. రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి అయ్యాక వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ లేని విధంగా సామ్ ముఖంలో ఏదో తెలియని ఒక షైన్ కనిపిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version