తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి
నడికూడ,నేటిధాత్రి:
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన లింగాల తిరుపతిని నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు భాష బోయిన రవీందర్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం యొక్క నిబంధనలకు లోబడి సంఘ సభ్యులను విస్తరించుకుంటూ తెలంగాణ ప్రజల,అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుటకు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కొరకు ఆత్మగౌరవం సంక్షేమం కొరకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకీ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులు రవీందర్ యాదవ్ కు అలాగే నా నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
