మేడారం జాతర కోసం బస్సు పాయింట్ ఏర్పాటు.

మేడారం జాతర కోసం బస్సు పాయింట్ ఏర్పాటు.

జాతర అనంతరం బస్టాండ్ ప్రారంభిస్తాం ఆర్టీసీ డిఎం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్ర గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లను శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన పరకాల బస్ డిపో మేనేజర్ రామ్ ప్రసాద్
ఈ సందర్బంగా మేడారం జాతర కు చిట్యాల్ ప్యాక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయబోయే బస్ పాయింట్ కి కావాల్సిన సదుపాయాన్ని కల్పించాలని వారు కోరడం జరిగింది దానికి స్పందించిన సర్పంచ్ హామీ ఇవ్వడం జరిగింది
అనంతరం సర్పంచ్ ఆదేశాల మేరకు ఈ యొక్క చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రారంభించాలని కోరగా వెంటనే స్పందించిన డిఎం బస్టాండు ఆవరణలో పరిశీలించి మేడారం జాతర తర్వాత ఈ నూతన బస్టాండు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు తౌటం నవీన్ ,ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ ,గౌడ్ గ్రామ కార్యదర్శి రవికుమార్ ,బస్సు కండక్టర్ డ్రైవర్లు నందకుమార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిల ను చెల్లించాలి..

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిల ను చెల్లించాలి

విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు వినతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి రిటైర్డు పొందిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ శనివారం నర్సంపేట ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మికి,సెక్యూరిటీ విజిలెన్స్ ప్రతినిధులకు వేరువేరుగా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర సారధ్య కమిటీ ఆదేశాల మేరకు అన్ని బస్ డిపోల వద్ద సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నర్సంపేట డిపో అర్పిఎస్ 2017 ఏరియర్స్, గ్రాజిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఫరెన్స్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.పిఎఫ్ పెన్షన్ విషయంలోనీ ఇబ్బందులను తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి పట్టాభి లక్ష్మయ్య, జిల్లా ప్రతినిధి రవీందర్ డిపో ప్రతినిధులు ఏవై స్వామి, ఎస్ వి చారి, ఏ సాంబయ్య,ఎ.కే స్వామి, దయానంద్, మోహనాచారి, జె. శ్రీనివాస్ రెడ్డి, సాదిక్ పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపోకు కొత్త అసిస్టెంట్ మేనేజర్, ఉద్యోగుల ఘన సన్మానం…

ఆర్టీసీ డిపోకు కొత్త అసిస్టెంట్ మేనేజర్, ఉద్యోగుల ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఆర్టీసీ డిపోకు నూతన అసిస్టెంట్ మేనేజర్గా శ్వేత కల్వకుర్తి నుండి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులు సిద్దయ్య స్వామి, సుకీర్త, సీతిలి భాయి, మరియు కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులే సంస్థ ప్రగతికి మూలమని, అందరూ కలిసి సంస్థ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version