కొడవటంచ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు దేవాలయం నూతన చైర్మన్గా నాయినేని సంపత్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవాలయాలు భక్తి, ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అలాగే భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు,గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
