చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక…

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

* సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుంది
* అధ్యక్ష, కార్యదర్శిలు నర్సిములు, రాజేందర్

చేవెళ్ల, నేటిధాత్రి:

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం శంకర్పల్లిలోని షారోని ప్రార్థన మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ నూతన ఫాస్టర్స్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన కమిటీలో నియోజకవర్గ ఫాస్టర్స్ అధ్యక్షులుగా ఆసాపు ( నర్సింలు ), ఉపాధ్యక్షులుగా ఎం. అనంతరావు ( జేమ్స్), కార్యదర్శిగా
డప్పు. రాజేందర్, సహాయ కార్యదర్శి
జి. ప్రేమానందం, కోశాధికారిగా వై.మల్లేష్( ఇస్సాకు)లను
ఎన్నుకున్నారు. సలహాదారులు గా, ఎన్.కృష్ణ పి.యాదయ్య, పి.సంజీవరావు, పిఎం. సామ్యూల్,
పి.అబ్రహం, ఎమ్.ఎమ్. సామ్యూల్, ఎస్.లింగం,
వి. దానియేలు, ఎస్.సంజీవరావు, జి.సామ్యూల్,
డి.జయకర్, వై.రమేష్ లతో నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన
కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు నర్సింలు (ఇస్సాకు )మాట్లాడుతూ..పాస్టర్లందరిని ఏకతాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం పోరాడుతుందని, ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సదుపాయాలను పాస్టర్లకు అందజేయడంలో కృషి చేస్తుందన్నారు. కమిటీ కార్యదర్శి డప్పు రాజేందర్ మాట్లాడుతూ..ఈ కమిటీ చర్చిల సమస్యలను ఆధ్యాత్మికంగా, సామాజికంగా సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుందని, చర్చిల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాస్టర్ల అవసరాలను తీర్చడంలో చురుకుగా వ్యవహరిస్తుందని, ఇది పాస్టర్ల సమాజానికి ఒక ఆశాకిరణంగా మారుతుందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కమిటీ సభ్యులుగా పాలకవర్గముగా నియమితులైన ఫాస్టర్లు ఈ నూతన కమిటీని ప్రభువు కృపలో దేవుడు బలపరిచి చేవెళ్ల నియోజకవర్గంలో అనేక కార్యాలు జరిపించాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలాల ఫాస్టర్స్, నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version