హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి మున్సిపాలిటీలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించిన 396వ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవoగురువారం ఘనంగా జరిపారుఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిoచారు.శివాజీ మహారాజ్ దేశభక్తి, మాట్లాడుతూ, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చిన పరిపాలకుడిగా, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావుడిగా శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. గెరిల్లా యుద్ధ తంత్రానికి ఆద్యుడిగా, భారత నౌకాదళ పితామహుడిగా ఆయన సేవలను గుర్తుచేశారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోటలను నిర్మించి శక్తి సాధనకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన సందర్భాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవానీ అమ్మవారి ఆశీర్వాదంతో ధర్మ స్థాపనకు కట్టుబడి పనిచేసిన మహానాయకుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతిని విజయవంతం చేశారు. ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా మహనీయుల జయంతులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
