ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…
11వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
ప్రజా సేవ చేస్తూ, 11వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటానని బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాజీ నగర్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు లోని సమస్యలను పరిష్కరిస్తానని గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 11వ వార్డు ప్రజలను, ఓటర్లను కోరుతున్నారు.
రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
