*స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి మెరిసిన తిరుపతి..
*రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 17:
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికయ్యిందిగురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫ్ఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ లతో కలసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య లు అవార్డును అందుకున్నారు. మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లీగ్ ను కైవశం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసా గుతోంది. ఏటా స్వచ్చ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోందిఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది, నగర ప్రజల తో పాటు ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వారు వ్యక్తం చేశారు.