రెండవ రోజున నిండు జీవితానికి రెండు చుక్కలు…!

రెండవ రోజున నిండు జీవితానికి రెండు చుక్కలు…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ గ్రామపంచాయతీ పరిధిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండవ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ అంగన్వాడీ కేంద్రం, బస్టాండ్ సమీప ప్రాంతంలో వద్ద పోలియో చుక్కలు వేయించుకో లేనటువంటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్ఎం శాంతమ్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష.

రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్ట కొడుతున్న సిసిఐ అధికారులు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ చేపట్టే చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. లేనిపక్షంలో ఈ దీక్షను ఇంకా ఉదృతం చేసి మాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని లారీ యజమానులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version