రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్ట కొడుతున్న సిసిఐ అధికారులు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ చేపట్టే చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. లేనిపక్షంలో ఈ దీక్షను ఇంకా ఉదృతం చేసి మాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని లారీ యజమానులు తెలిపారు.