గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజల జేబులు కాళీ…

గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజల జేబులు కాళీ

◆:- దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రిలు.

◆:- ఆస్పత్రి పేరేమో మనుషులను బ్రతికించేది, ఆసుపత్రి బిల్లు చూస్తే ప్రజలకు ప్రాణాలు పోతున్నాయి.

◆:- హాస్పిటల్ యజమాన్యం ప్రభుత్వ వైద్యులు,

◆:–ప్రభుత్వ వైద్య అధికారులే ప్రోత్సహిస్తున్నారా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఆసుపత్రి గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ లక్షల లక్షలు దోచుకుంటున్నట్లు ప్రజలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజలను పీడించి లక్షల్లో దోచుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ సొంతగా ప్రైవేట్ హాస్పిటల్లు ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే పేద రోగుల నుండి లక్షల్లో దండుకుంటున్నా గాని జిల్లా వైద్యాధికారులు

పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఒక్కరోజు అడ్మిన్ అయితే 20000 నుండి 30 వేల రూపాయల ఫీజు, డాక్టర్ వచ్చి పేషెంట్ ని పరీక్షిస్తే ఒక రోజుకి 1500 రూపాయలు తీసుకుంటూ పేద ప్రజలను నిలువునా దోపిడికి గురి చేస్తున్నా కానీ జిల్లా వైద్య అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించుకుంటూ పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తూ ఇటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కానీ జిల్లా వైద్య అధికారులకు ఎందుకు కనబడడం లేదు. ఇలాంటి ప్రైవేట్ ఆస్పత్రి పైన చర్యలు తీసుకుంటే తప్ప పట్టణంలో పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందే పరిస్థితి కనబడటం లేదని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వ వైద్యులు యజమాన్యంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆస్పత్రిని ఎవరి అండ దండ తో నడుపుతున్నారో ప్రజలకు అర్థం కాని ప్రశ్న? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఇలాంటి ఆసుపత్రి పైన ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటే తప్ప పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి లక్షల్లో దోపిడి నుండి ఉపశమనం కలిగించిన వారు అవుతారని ప్రజలు కోరుతున్నారు.

కార్మికులు,గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు .!

కార్మికులు,గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న పాలకులు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తుల లాభాల కోసం పాలకులు తాకట్టు పెడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం గార్ల మండల కేంద్రంలో సిఐటియు, ఏఐటీయూసీ,ఐ ఎఫ్ టి యు, ఐ ఎన్ టి యు సి,బిఆర్ఎస్, విశ్వ సమాజం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తూ,పట్టణ పూరవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.

 

 

 

 

 

ఈ సందర్భంగా కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు కందునూరి శ్రీనివాస్,కట్టెబోయిన శ్రీనివాస్, గుగులోతు సక్రు, విశ్వ జంపాల,గంగావత్ లక్ష్మణ్ నాయక్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు,వ్యవసాయ రంగంలో ప్రతికూలమైన విధానాలను అమలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం ఉపాధి మరియు సామాజిక భద్రతా నిబంధనలపై తప్పుడు వాదనలు చేస్తుందన్నారు.

 

 

 

 

 

 

కేంద్ర బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 29 కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా వారి శ్రమను అమ్మ చూస్తుందన్నారు.కార్మిక వ్యతిరేక,యజమాని అనుకూల నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా,ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి సమిష్టి బేరసారాలకు వారి హక్కును లాక్కోవడానికి,సమ్మె చేసే హక్కును,యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించడాన్ని,నేర రహితంగా చేయడానికి, ట్రేడ్ యూనియన్ల కార్యకలాపాలను నేరంగా పరిగణించడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని అన్నారు.కనీస వేతన చట్టం చేయని ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది గంటల పని సమయాన్ని 12 గంటలుగా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని వారు విమర్శించారు.ఈ సమ్మె కార్యక్రమంలో అంగన్వాడి, హమాలీ కార్మికులు, ఆశా కార్యకర్తలు,మధ్యాహ్న భోజన కార్మికులు,ఐకెపి, గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామ సేవకులు, అసంఘటిత రంగ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అలవాల సత్యవతి,జంపాల వెంకన్న,మాలోత్ మాన్య, రామకృష్ణ,ఎం సురేష్,భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version