టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే?
భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్కి దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్కి దిగనుంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టెస్టు, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన రో-కో.. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు.
