జయశంకర్ పేరుతో యునివర్సిటీని స్థాపించాలి

జయశంకర్ పేరుతో యునివర్సిటీని స్థాపించాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హాబ్ గా ఏర్పాటు చెయ్యాలి

సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మరపేల్లి మల్లేష్

వికెసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వికేసి విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మరపేల్లి మల్లేష్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లాలో సమృద్ధిగా వనరులు ఉన్న వెనుకబడి పోతావుంది పాలకుల నిర్లక్ష్యం మూలంగా విద్య వైద్యం అందని ద్రాక్షలా మారింది భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి జిల్లాను పారిశ్రామికంగా బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవడంలో పాలకుల విఫలమయ్యారని ఆరోపిస్తున్నాను ఈ జిల్లాలో విద్యారంగానికి పెద్దపీట వేసి కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని నిరుపేద విద్యార్థుల కోసం పై చదువుల కోసం జయశంకర్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని పాలకులను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా స్టడీ సర్కిల్ ఎడ్యుకేషన్ హబ్బుగా ఏర్పాటు చేయాలని విద్యార్థులకు యువకులకు అందుబాటులో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నేటి నుంచి యూనివర్సిటీ కోసం ఉచిత కోచింగ్ సెంటర్ల కోసం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పాటు చేసేంతవరకు ప్రతిరోజు ఉద్యమాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలో ఉన్న అధికార యంత్రం గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విద్యార్థి యువతీ యువకుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని భూపాలపల్లి జిల్లాలో ఉన్న అధికారులకు జిల్లాలో ఉన్న పాలకులకు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో అక్కల బాబు యాదవ్ యు వై ఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు బోయ సదానందం రాజమణి మహిళా నాయకురాలు పాల్గొన్నారు

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మున్సిపల్ 6వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీలతో నారీ శక్తి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి మున్సిపల్ 6 వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి హాజరు కావడం జరిగింది.వారు విద్యార్థులకు మహిళా బిల్లు 33./. శాతం రిజర్వేషన్ గురించి వివరించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్‌సభ రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ద్వారా నిర్ణయాధికారంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలు రాణిస్తున్నారని, ఇప్పుడు చట్టసభల్లో కూడా అడుగుపెట్టడం ద్వారా మహిళల సమస్యలు, విద్య, ఉపాధి వంటి అంశాలపై మరింత సమర్థవంతంగా పోరాడవచ్చని తెలిపారు. అంతేకాకుండా దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మైలురాయి అని కొనియాడారు.
​ఈ సందర్భంగా, ప్రతి మహిళా మేధావి, చదువుకున్న యువతులు రాజకీయాల్లోకి రావాలని, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు కల్పించిన ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజికంగా ఆర్థికంగా కూడా వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు భుఖ్య భాగ్య,బూర పద్మ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ సరూప, వేషాల సత్యవతి, కవిత, సునీత లతోపాటు పార్టీ జనరల్ సెక్రటరీ దొంగల రాజేందర్, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,తిరుపతి రెడ్డి,పొన్నాల కొమరన్న తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version