నిరుపేదలకు ఇల్లు మంజూరు…

నిరుపేదలకు ఇల్లు మంజూరు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3,12వార్డులలో శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారం తో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్ పూజ చేశారు.ఈ సందర్బంగా బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలు నాయక్, రాజేష్,క్రాంతి,కార్తీక్ వార్డు ఆఫీసర్ శివ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version