ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో కూడా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్లమెంటులో జాతీయ ప్రయోజన అంశాల గురించి మాట్లాడటంపై ఆంక్షలు విధిస్తున్నారని ఖర్గే ఆరోపించడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు (Kharge Nadda argument).
‘పార్లమెంట్ అంటే లోక్ సభ, రాజ్యసభ రెండూ ఉంటాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడాలనుకున్నారు. కానీ అలా చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. మీరు సభను ఇలా ఎలా నడపగలరు’ అని ఖర్గే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘లోక్సభ కార్యకలాపాలను రాజ్యసభలో చర్చించలేము. నా గౌరవనీయ సహోద్యోగి ఈ విషయాన్ని తెలుసుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేనిపైనా చర్చ నిర్వహించడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నడ్డా అన్నారు (Rajya Sabha disruption).
‘లోక్సభలో ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోదీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు (Parliament chaos India). కానీ ప్రతిపక్షం సభా కార్యకలాపాలను ముందుకు సాగనివ్వడం లేదు. ప్రతిపక్షాలు అడిగినట్లుగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఒక ప్రకటన చేశార’ని జేపీ నడ్డా గుర్తు చేశారు. తీవ్ర వాగ్వాదం తర్వాత, ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.a
