డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు.

డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీత నగర్ సిరిసిల్ల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుండి దాదాపు లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ లో 25 బాలబాలికలు మరియు దాదాపు 25 మంది డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ లో బాలబాలికలు ఉత్తీర్ణు లైన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందజేసినటువంటి మెమోలు ఈరోజు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యల్.శారద అందజేసినారు ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు రాయడానికి అర్హత కేవలం ఎనిమిదవ తరగతి చదివే పిల్లలనుండి డిగ్రీ పీజీ వరకు చదివే పిల్లలు వరకు అర్హులు భవిష్యత్తులో ఇట్టి పరీక్షలలో పాసైన వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగము హైదరాబాదు వారు నిర్వహించే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ చేయడానికి అర్హులు అవుతారని ప్రధానోపాధ్యాయురాలు గారు చెప్పారు ఇట్టి టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ప్రభుత్వ డ్రాయింగ్ మాస్టర్స్ గా ఉద్యోగం పొందడానికి అర్హులవుతారు మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ పరీక్షలు కూడా ఇట్టి నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు వారు కూడా క్రాఫ్ట్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులవుతారని చెప్పారు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి పరీక్షలకు అందరూ ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి చేశారు. ఈ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తో పాటు డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అర్హులవుతారని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version