పోత్కపల్లి లో అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ..
అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. గ్రామంలోని రెండు మూడు వార్డులు డ్రైనేజీ పూర్తిగా గడ్డి తో కప్పబడి ఉంది.వీటి వల్ల దోమలు ఎక్కువడడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గ్రామపంచాయతీకి నూతన పాలకవర్గం వచ్చి దాదాపుగా నెల రోజులు గడుస్తున్న ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి గ్రామంలో డ్రైనేజీ పారిశుద్ధ పై ప్రత్యేక దృష్టి వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
