గ్రామాన్ని శక్తిమంతం చేయడమే లక్ష్యం: సర్పంచ్ మందుల నాగయ్య.

గ్రామాన్ని శక్తిమంతం చేయడమే లక్ష్యం: సర్పంచ్ మందుల నాగయ్య.

కోదాడ, నేటి ధాత్రి:

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ లో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం లో భాగంగా గ్రామ స్వరాజ్యం – ప్రగతి పాలన వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గ్రామ సెక్రటరి, ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి, వ్యవసాయ అధికారి సల్మా, ఏఎన్ఎం మేడం,గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : సర్పంచ్ శశివర్ణ

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : సర్పంచ్ శశివర్ణ

బాలానగర్ /నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శశివర్ణ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న వార్డులను పరిశుభ్రంగా మార్చినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని.. పరిశుభ్రతను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version