గ్రామాన్ని శక్తిమంతం చేయడమే లక్ష్యం: సర్పంచ్ మందుల నాగయ్య.
కోదాడ, నేటి ధాత్రి:
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ లో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం లో భాగంగా గ్రామ స్వరాజ్యం – ప్రగతి పాలన వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గ్రామ సెక్రటరి, ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి, వ్యవసాయ అధికారి సల్మా, ఏఎన్ఎం మేడం,గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
