“18వ వార్డులో కాంగ్రెస్ జోరు ప్రచారం”

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం…

18 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లె శ్రీదేవి -రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బాగంగా 18 వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు.18 వ వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లె లావణ్య రాజు లు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని 18 వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథరెడ్డి ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి 18 వ వార్డ్ లో బలపరిచారని ప్రజలు అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరారు. హస్తం గుర్తు కు ఓటు వేసి భారీ విజయం అందించాలని ప్రచారం చేశారు.గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version