మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ ఆవిర్భావ సభ…

మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి
ఆగస్టు 20న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకుడు,మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్.పిడమర్తి రవి నాయకత్వంలో పానీ పూరీ గో బ్యాక్ అనే నినాదంతో రాష్ట్రం లో మరో తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమ ఆవిర్భావ సభ జరుగుతుందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బతుకు దెరువుకోసం తెలంగాణకు వచ్చి ఆర్ధిక పరిపుష్టి సాధించి, బరితెగించి దాడులకు దిగుతున్న ఉత్తరాది మార్వాడీల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ,జరుగుతున్న ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలో నీ అన్ని జిల్లాలో ఉన్న తెలంగాణ వర్తక సంఘం మరియు స్థానిక వ్యాపారులు,ప్రజా సంఘాల నాయుకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మైస ఉపేందర్ మాదిగ తెలిపారు.

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా ఉన్నతమైనటువంటి విద్యాశాఖ ను తన దగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కుట్ర మానుకోవాలని హెచ్చరించారు వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని అదేవిధంగా
ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలనకు చర్మ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటని విద్యార్థుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా పాలిస్తున్న ఈ పాలనను ప్రజా పాలన అంటారా ?ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలను తలపించే విధంగా ప్రశ్నించే ప్రతి వారిపై నిర్బంధాలను విధిస్తూ ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వాగతించడం లేదని వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పై విధించిన నిర్బంధాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version