వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా.. నష్టమేమీ లేదు..

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా.. నష్టమేమీ లేదు..

 

 

ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెటో, బిస్కెటో కాదని తెలిపారు.

అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా.. అని ఆ కల నెరవేరకుండా.. వైసీపీ ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోమ్ మినిస్టర్ అనిత ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదికని సూచించారు. జగన్‌‌కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని హితవు పలికారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని అనిత ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెటో, బిస్కెటో కాదని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబుని అవమానిస్తే ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చి పోరాటం చేశారని ధీమా వ్యక్తం చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version