రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ కొత్త బ్రాంచ్‌ను జోనల్ హెడ్ శ్రీ గంధం కృష్ణ కుమార్ ప్రారంభించి జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ 1887లో తిరువనంతపురం, కేరళలో స్థాపించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3600కు పైగా బ్రాంచులతో విస్తరించింది. ఈ బ్రాంచ్‌లు హైదరాబాద్ జోన్‌లోకి వస్తాయి” అని తెలిపారు.

తక్కువ డాక్యుమెంటేషన్‌తో గోల్డ్ లోన్స్,
టూ వీలర్ లోన్స్, బిజినెస్ లోన్స్,
చిన్న వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు.
మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు,
బీమా ఉత్పత్తులు (జీవ, ఆరోగ్య, జనరల్)
ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ సేవలు,
బిల్లు పేమెంట్లు, మొబైల్ రీఛార్జీలు, ఇతర డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ శ్రీపద్ శాస్త్రి, ఏరియా మేనేజర్ అమర్నాథ్, బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి, నందిని, వనిత, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version