మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరువు తూములను వెంటనే మరమ్మతు చేసి రైతులకు నీటి సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే
స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు తక్షణ చర్యలు తీసుకొని చెరువు తూములను పునరుద్ధరించి సాగునీటి సమస్యను పరిష్కరించాలనరు
