ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి.

జహీరాబాద్ ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు మోరీలు నిర్మించడం లేదు దాదాపు ఈ ఏరియా గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది కానీ మున్సిపాలిటీ ఏరియా అని ఇంటి టాక్స్లు వసూలు చేస్తున్నారు కానీ ఇంటి ముంగట రోడ్డు గాని మోరిల్ల నిర్మాణం గానీ చేపట్టడం లేదు స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేయడం జరిగింది జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ కు దీనిపైన చొరవ తీసుకొని టాక్స్లు వసూలు చేసుడు కాదు ముందు మోరిలా నిర్మించాల్సిందిగా స్థానిక ప్రజలు కాలనీవాసులు కోరుతున్నారు మరియు ఈ రాంనగర్ 100 ఫీట్ల రోడ్డు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ రోడ్డుకు రెండు సైడ్ల మోరీలు కట్టలేని పరిస్థితి దీనివల్ల వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్డు పాడయింది ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా చూసి చూడనట్టు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఎవరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఫ్లైఓవర్ నుండి రాంనగర్ దర్గా వరకు రెండు వైపుల పెద్ద మోరి నిర్మించాల్సిందిగా మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తొందర్లో రోడ్డు మరియు మోరీలు నిర్మించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందట రాంనగర్ కాలనీ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ బాగా రెడ్డి కాలనీ జమాలీ కాలనీ సలాం నగర్ కాలనీ ప్రజలతో ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version