బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి..

బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి

ఓటు హక్కుతో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి

పాఠశాల ప్రిన్సిపాల్ పిండి.యుగేందర్

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో మాక్ ఎలక్షన్ల సందడి బిట్స్ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు.పాఠశాల ఎస్పీఎల్,ఏఎస్పీఎల్ గా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులుగా ఉంటూ అభ్యర్థులకు గుర్తులను కేటాయించి విద్యార్థులందరినీ ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొనేటట్లు చేశారు.విద్యార్థులు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం చాలా బాగుందని తెలియజేశారు.మాక్ ఎలక్షన్ లో భాగంగా గెలుపొందిన ఎస్పీఎల్ గా సూర.చాందిని,ఏ ఎస్పీఎల్ గా తంగళ్ళపల్లి,యశస్విని అభ్యర్థులను బిట్స్
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ ఓటు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని భవిష్యత్తులో ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలియజేశారు.పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version