దొంగల ముఠా అరెస్టు..అభరణాలు స్వాదీనం…

దొంగల ముఠా అరెస్టు..అభరణాలు స్వాదీనం

నిందితులను రిమాండ్ కు తరలింపు.

రాత్రి సెకండ్ షో సినిమాలు చూస్తూ…దొంగతనాలకు..

నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి
2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, ఐదు సెల్ ఫోన్లు, ఒక ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.నర్సంపేట డివిజన్ సహా పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి తెలిపారు. గత ఆగస్టు నెల నుండి నర్సంపేట సబ్ డివిజన్ పల్లెతోపాటు మహబూబాబాద్ ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ అనే వ్యక్తి అతని స్నేహితుడు అదే జిల్లాకు ఆర్టీసీ కాలనికి చెందిన మాదాసు నవీన్ తో దొంగతనాలకు ప్లాన్ చేశారు.ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు గాను నవీన్ భార్య మాదాసు భార్గవితో పాటు ఆమె బందువులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి,అదే జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండై గూడెం గ్రామానికి చెందిన కుంజా విజయ ఇద్దరు అక్కలతో
ఒక గ్రూప్ గా ఏర్పడిన ఈ ఐదుగురు నిందితులు తాళంవేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ రవీందర్ తెలిపారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ సూత్రధారి కాగా, అదే జిల్లాకు ఆర్టీసీ కాలానికి చెందిన మాదాసు భార్గవి, నవీన్ లు అతనితో చేతులు కలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి, కుంజా విజయతో కలిసి రాత్రిళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు.నర్సంపేట డివిజన్ లో ఆగస్టు నెలలో ఖానాపురం మండలం బుధారావుపేటలో, సెప్టెంబర్ నెలలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఓ నగల షాపులో దొంగతననానికి పాల్పడినట్లు గుర్తించారు.మరో రెండు దొంగతనాలు మహబూబాబాద్ పట్టణంలో చేసినట్లు గుర్తించారు. దొంగతనాల్లో దోచుకున్న సొమ్ములో కొంత మేరకు అవసరానికి వాడుకున్నట్లు, మరికొంత ఆటో, ద్విచక్ర వాహనం కొనడానికి వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వాటిలో 2 తులాల 2 గ్రాముల బంగారం, 38 తులాల వెండి వీటి విలువ రూ.4 లక్షల 30వేలుగా పోలీసులు నిర్ధారించారు. వీటిలో 2 లక్షల 70 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ . లక్షా ముప్పై వేలు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు.ఐతే ఈ ముఠా దొంగతనాలకు పాల్పడేముందు
మొదటి ముద్దాయి మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇమాం తన ద్విచక్ర వాహనంపై పగలు పూట రెక్కి నిర్వహిస్తాడు.రాత్రి ఐదుగురు ముఠా సభ్యులు తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసే ముందు సెకండ్ షో సినిమా చూస్తారు.అనంతరం ఇండ్లల్లో చొరబడి దొంగతనాలకు పల్గడుతున్నట్లు తెలిపారు.పలు ఫిర్యాదుల మేరకు సీసీ కెమెరాలు సహకారంతో నిదితులను అరెస్టు చేసి విచారించగా వరుస దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.బంగారం, వెండి ఆభరణాలతో తో ఐదు సెల్ ఫోన్లు,ఒక ఆటో,ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి వివరించారు.ఈ మీడియా సమావేశంలో నర్సంపేట టౌన్ ఎస్సై రవికుమార్,రూరల్ ఎస్సై అరుణ్ కుమార్,నర్సంపేట షీ టీమ్ ఎస్సై స్వాతి,హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజం అలీ,నాగరాజు,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
*వరుస దొంగతనాల పట్ల దర్యాప్తు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నాగరాజు చొరువ చాకచక్యంగా వ్యవహరిండం పట్ల ఎసిపి రవీందర్ రెడ్డి కానిస్టేబుల్ నాగరాజు అభినందించారు.

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ అందజేత.

సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ అందజేత.

సీఐ మల్లేష్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ తో కలిసి చిట్యాల సిఐ మల్లేష్ 2 మొబైల్స్ లని పోగొట్టుకున్న బాధితులకు సోమవారం రోజున అందించారు, చల్లగరిగ గ్రామానికి చెందిన
శ్రీ బరన్ రెడ్డి తను 3 నెలల క్రితం తన వన్ ప్లస్ మొబైల్ ని పోగొట్టుకొని, మరియు చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ సతీష్ నెల క్రితం తన రియల్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శ్రీ భరణ్రెడ్డికి మరియు సతీష్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ అభినందించారు
ప్రజలకి ఎవరికైనా మొబైల్స్ దొరికితే పోలీస్ స్టేషన్ ల లో అప్పచ్చెప్పలని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ నీ ఉపయోగించి మొబైల్స్ నీ సులువుగా గుర్తించవచ్చు అని, దొరికిన మొబైల్స్ ను తమ వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్ లో అప్పగించి మంచి మనుసు చాటుకోవాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version