29వ డివిజన్లో ఘనంగా ఇఫ్తార్ విందు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 29వ డివిజన్లో ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ వేముల సంధ్య,మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తూ పరస్పరం స్నేహభావాన్ని పంచుకుంటున్నామన్నారు. హిందూ-ముస్లిం సోదరభావంతో కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక భావజాలానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సామరస్యానికి కట్టుబడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మౌలానా షాహిద్ రజా, ఎండి మసూద్, ఎండి జలీల్, ఎండి అఖిల్ పాషా, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి నిజాం పాషా, పట్టణ ఉపాధ్యక్షుడు నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాంగ్రెస్ నాయకులు దండెం రతన్ కుమార్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఎండి రియాజ్, ఎండి గౌస్ భాష, ఎండి అన్ను, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
