హద్నూర్ ఇష్టర్ గుట్టలో జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరు కాగలరు…

హద్నూర్ ఇష్టర్ గుట్టలో జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరు కాగలరు

◆-: హద్నూర్ ఇష్టర్ గుట్ట

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ క్రైస్తవ హద్నూర్ గ్రామంలో గల ఈస్టర్ గుట్ట వద్ద మార్చి 6, 7, 8 తేదీలలో నిర్వహించనున్న క్రైస్తవ ఉజ్జీవ కూటముల జాతరకు సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు హాద్నూర్ క్రైస్తవ సంఘ పెద్దలు మరియు యువకులు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉజ్జీవ కూటముల్లో పాల్గొని ఆత్మీయంగా బలపడాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసం, ఐక్యత, ప్రేమ మరింత ఆప్యాయత అనురాగాలు, మానవ విలువలు, బలపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాద్నూర్ మెథడిస్ట్ సంఘ కాపరి (సర్కిల్ ఇంచార్జ్) రేవ్. బి, జార్జ్ అబ్రహం తో పాటు సంఘ పెద్దలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ క్రైస్తవ ఉజ్జీవ కూటముల జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.— హాద్నూర్ క్రైస్తవ సంఘం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version