పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత,…

పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

నార్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని భాస్కర్ తన మొబైల్ ను మార్గమధ్యంలో నాలుగు నెలల క్రితం పోగొట్టుకున్నాడు. బాధితుడు నిజాంపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా సీఈఐఆర్ అనే వెబ్ సైట్ లో నమోదు చేసి ట్రాక్ చేసి బాధితుడికి మొబైల్ ను స్థానిక ఎస్ఐ రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొబైల్ పోగొట్టుకున్నట్లయితే..అధైర్య పడకుండా సీఈ ఐఆర్ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నట్లయితే మొబైల్ ను పొందవచ్చన్నారు.

చిట్యాల పోలీసుల చేత తిరిగొచ్చిన మొబైల్

పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.

చిట్యాల, నేటిదాత్రి

 

చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version