కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

◆ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్…

◆ అభివృద్ధి పనులపై సమీక్ష…

◆ సమస్య ఉంటే వెంటనే చెప్పండి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో అష్ట తీర్థాల సంగమంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే మార్గంలో పారిశుద్ధ్య, మొక్కల సంరక్షణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవి ధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూసు కోవాలన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అంద జేయాలన్నారు. మేదపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావే శంలో జిల్లా పరిషత్ సీఈవో జానకిరామ్ రెడ్డి, డీపీఓ సాయి బాబా, జహీరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version