డి హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పొన్నగంటి లావణ్య ఎన్నిక

డి హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పొన్నగంటి లావణ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

దళిత హక్కుల పోరాట సమితి రెండవ రాష్ట్ర మహా సభలు ఏప్రిల్ 17, 18 వరంగల్ లో జరిగినవి. ఈ మహా సభల లో భూపాలపల్లి జిల్లా రాష్ట్ర సమితి లో ప్రాధాన్యత దక్కింది. పొన్నగంటి లావణ్య ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక గా, రాష్ట్ర సమితి సభ్యులుగా రాస పెళ్లి భద్రయ్య ఎన్నిక అయ్యారు.దళిత హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న డి హెచ్ పి ఎస్ రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో భాగంగా, ప్రముఖ సామాజిక కార్యకర్త పొన్నగంటి లావణ్యను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పొన్నగంటి లావణ్య గత కొంతకాలంగా దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం పోరాటాలు చేసినారు
ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దళితుల హక్కుల కోసం పోరాడుతానని, సమానత్వ సమాజ నిర్మాణమే న లక్ష్యమని పేర్కొన్నారు. నా ఎన్నికకు సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీకి సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కి కృతజ్ఞతలు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version