నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్..

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ళ శ్రీనివాస్,మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడిగోటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడుతూ జిల్లాలోని నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్, రాము, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు భూపాలపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ ఎన్నుకున్నట్లు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అధ్యక్ష కార్యదర్శులు శాలువాలతో సన్మానించి స్వీట్ తినిపించి అభినందించారు. అలాగే మండలాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version