పలమనేరు మార్కెట్ అభివృద్ధికి సహకరించండి..

పలమనేరు మార్కెట్ అభివృద్ధికి సహకరించండి

*సీఎం, మంత్రిని కలసి విన్నవించిన
ఏ యంసి,
చైర్మన్ రాజన్న..

పలమనేరు(నేటి ధాత్రి)

పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహకరించాలని స్థానిక శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సూచన మేరకు ఏఎంసి చైర్మన్ రాజన్న ముఖ్యమంత్రి చంద్రబాబును, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం సాయంత్రం కలసి విన్నవించారు. పలమనేరులో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసి సహకరించాలని విజయవాడలో వారిని కలసి కోరారు. ఇక్కడి మార్కెట్ లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండడం కారణంగా స్థానిక రైతులు అధిక శాతం తమ వ్యవసాయ ఉత్పత్తులను కర్ణాటక మార్కెట్ కు తరలిస్తూన్నారని వివరించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటుతో చెన్నై, బెంగుళూరు నగరాలకు రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, దీంతో స్థానిక రైతులకు గిట్టుబాటు ధర పొందెందుకు అవకాశం ఉంటుందన్నారు.మరోవైపు కుప్పం – క్రిష్ణగిరి రహదారి విస్తరణ త్వరలో ఏర్పాటు కానుండడంతో పాటు రామకుప్పం మండలంలో రానున్న కార్గో విమాన సేవలతో ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు తరలించుకోవడానికి వీలుంటుందని తెలియజేశారుకాబట్టి పలమనేరు మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాజన్న పేర్కొన్నారు.

పలమనేరు మార్కెట్‌లో రైతుల ఆవేదన…

పలమనేరు మార్కెట్ యార్డ్ లో దళారుల చేతిలో మోసపోతున్న రైతులు !కానరాని అధికారులు

పలమనేరు(నేటి ధాత్రి)సెప్టెంబర్ 13:

పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులను దళారీ వ్యవస్థ పూర్తిగా మోసం చేస్తుంది అనడంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి అన్నం పెట్టే రైతును దళారీ వ్యవస్థ ఏకమై పూర్తిగా రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా పూర్తిగా మోసం చేస్తున్నారు, చాలీచాలని ధరలు కు ఎంతో కష్టంతో పండించిన కూరగాయలను వదులుకొని వెళ్తున్నారు, రైతులు అదేవిధంగా రైతులకు కనీ సౌకర్యాలు కూడా లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు, అధికారులు ఎన్నోమార్లు వార్త కథనాల రూపంలో ఈ సమస్యలను గుర్తించిన కనీసం రైతులను కనికరించడంలో అటు యంత్రాంగం ఇటు అధికారి యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని విమర్శ కూడా ఉంది, ఏఎంసీకి ఎన్నికైన చైర్మన్
లు తమకు ఎంత లాభం వస్తుంది తీసుకుందామా వెళ్లిపోయామని ఉన్నారే కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, పలమనేరు మార్కెట్ యాడ్ కోసం ఎంపిక చేసిన 40 ఎకరాల స్థలం శంకుస్థాపనకే పరిమితమైంది కానీ రైతులకు సౌకర్యాలు అందించడంలో విఫలమైందని అర్థమవుతుంది అటు కర్ణాటక రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించుకుంటూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంటే పక్కనే ఉన్న పలమనేరు మార్కెట్ యార్డులో అధికారులు దళారులు చేతుల్లో రైతుల్ని పెట్టి ముప్పతిప్పలు పెడుతున్నారు ఇందులో దళాలు చేతునుంచి అధికారులు ఎంత తీసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా అసౌకర్యంగా ఉన్న పలమనేరు మార్కెట్ యార్డ్ ను నూతనంగా కేటాయించిన స్థలానికి మార్చి దళారుల వ్యవస్థను దూరం చేసి పూర్తిగా రైతులను ఆదుకోకుంటే రాబోవు రోజుల్లో పలమనేరు మార్కెట్ యార్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైతులు మక్కువ చూపాల్చి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై పై జిల్లా
అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని పలమనేరు నియోజకవర్గం ప్రజలను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version