సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :
ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్, ప్రధాన కార్యదర్శి కంటం కృష్ణారెడ్డి అన్నారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అలియాబాద్ కు చెందిన వైల ఎల్లయ్య వైద్య పరీక్షలకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.30.000 చెక్కును శనివారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టి నాయకులు నాటకారి బాబు, లబ్ధిదారుడు ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
