ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి పేరుతో కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేయాలని బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్
నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి:-
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ శ్రీ తల్లోజు ఆచారి సంచలన ప్రకటన ,కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేసి, ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రేషన్, RDO, STO, RTO కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటికి దూరం ,తల్లోజు ఆచారి ప్రకటనతో కల్వకుర్తి – ఆమనగల్ రాజకీయాల్లో ఉత్కంఠ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉంటుందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ, రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి జిల్లా అంశంపై స్పష్టత ఇస్తుందా? ఆమనగల్లులో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటుందా? ప్రభుత్వ చర్చ ,గత మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, ఆమనగల్లు మున్సిపాలిటీలో బీజేపీ పాలకవర్గం , స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా రేపు మాడుగులలో కార్యక్రమం జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ,కల్వకుర్తి నియోజకవర్గ అఖిలపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలని,ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి, రేపటి సీఎం భేటీపై సర్వత్రా ప్రజల్లో ఆసక్తి, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ*
