జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి….

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.

జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు,ఇండ్లు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి..

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు

జిల్లా కలెక్టర్ కు వినతి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)
జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రం సతీష్ కుమార్, గుజ్జ సారేశ్వరరావు లు మాట్లాడుతూ…. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలికంగా పనిచేస్తుందన్నారు. పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమమే ఏజెండాగా కృషి చేస్తుందన్నారు. జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందింది. వేలాది మంది సభ్యత్వం కలిగిన ఫెడరేషన్, సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వినతిపత్రాలు, దరఖాస్తులు ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి తెస్తుందన్నారు.
జయశంకర్ భూపాలపల్లి
జిల్లా వ్యాప్తంగా సుమారు 500మంది వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉన్నారనీ, ఇందులో కేవలం
274 మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులున్నాయన్నారు.
అక్రిడిటేషన్లు గత ఏడాదిన్నర కాలంగా స్టిక్కర్లతో నడుస్తున్నాయనీ,
పర్మినెంట్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గతంలో 37 మందికి ఇంటి స్థలాల పట్టాలి ఇచ్చారని, కావున వీరితోపాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. రేగొండ మండల కేంద్రానికి చెందిన 12 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారని, వీరికి కూడా స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా టేకుమట్ల మండలంలోని జర్నలిస్టులకు సైతం పట్టాలు ఇచ్చారు కానీ స్థలం కేటాయింపులో జాప్యం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు రాయితీ కల్పించడం లేదనీ, కావున అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు . కావున పై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు గైకొనగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, రోంటా ల శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి,కోశాధికారి మండల రాంబాబు,
జాయింట్ సెక్రెటరీ టి. దుర్గయ్య, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ప్రవీణ్ కుమార్, కోశాధికారి భాస్కర్, మీడియా కన్వీనర్ పుల్ల సృజన్, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, రహీం పాషా, జోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్డుల సమస్యలను విస్మరిస్తే…ఆందోళన తప్పదు..

జర్నలిస్డుల సమస్యలను విస్మరిస్తే…ఆందోళన తప్పదు

టియూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం.

భూపాలపల్లి నేటిధాత్రి

 

జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తే ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) స్పష్టం చేసింది.
హైదరాబాదులోని శంకర్ పల్లి మండలం వద్ద గల ప్రగతి రిసార్ట్స్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ హలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వాటిని తీర్చడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్ లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటుంన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడం చాలా విచారకరమని తెలిపారు.
జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల జారీ కి సంబంధించిన ప్రక్రియను వీలైనంత తోందరగా చేపట్డి జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన బాట పట్టక తప్పదని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.ఇప్పకే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తో చర్చించినట్లు తెలుపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్డులు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా అకాడమి చైర్మేన్ శ్రీనివాస్ రెడ్డి కి వివరిస్తూ, జిల్లా లో జర్నలిస్ట్ శిక్షణా తరగలుతు ఏర్పాటు చేయడం కోసం వినతిపత్రాన్ని ఇవ్వడంతో సానుకూలంగా స్పందించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విదంగా చూస్తానని, తొందరలో జిల్లాలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తాని సానుకూలంగా స్పందించిన చైర్మెన్ కి జిల్లా కమిటి అభినందనలు తెలిపామన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరబద్రస్వామి, సీనియర్ రిపోర్టర్ పుల్ల రవితేజ, ఐలయ్య లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version