మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

ఒకే సమస్య ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలి.

ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు ,కళ్లకు గంతలు కట్టి నిరసన

నేటి ధాత్రి, పాటన్ చేరు :

విద్యుత్ ఆర్టిజన్, మీటర్ రీడర్లను, పీస్ రేట్ కార్మికులను, ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించాలని మూడవరోజు నిరవధిక సమ్మెలో భాగంగా పటాన్చెరు డివిజన్ కార్యాలయం ఎదుట వంటావార్పు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. అనంతరం రాష్ట్ర డివిజన్ జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి ,పర్వయ్య ,రఘు మాట్లాడుతూ ఒకే సమత్సలో రెండు రూల్స్ అమలు చేయడం కరెక్ట్ కాదని, చేస్తున్న పని ఒకటే అయినప్పుడు రెండు రూల్స్ అమలు చేయడాన్ని తప్పు పట్టారు ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నప్పుడు రెండు రూల్స్ అమలు చేసి బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను అమలు చేసి కార్మికుల జీవితాలతో శ్రమ దోపిడీకి గురిచేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం దిగి వచ్చేవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు అప్పటి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు పాదయాత్రలో హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ హక్కులను నెరవేర్చేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు ఈరోజు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భట్టి విక్రమార్క గారు మాట మార్చడం బాగోలేదని విద్యుత్ కార్మికులను పట్టించుకోవడంలేదని తెలిపారు విద్యుత్ సమస్యలు ఏదైనా తలెత్తే మాత్రం యాజమాన్యం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా జేఏసీ నాయకులు పలు యూనియన్ల సంఘాల అధ్యక్షులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, ఉపేందర్, నరసింహ, అక్షయ్, ముజీబ్, మురళి, సుధాకర్ ఎల్లేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version