రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మండ లానికి ఈ వానాకాలం వేసుకో డానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై శాయం పేట పిఎసిఎస్ కు 266 బస్తాలు మరియు ప్రగతి సింగారం గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 233 బస్తాలు కెటాయించడం జరిగింది. ఒక్కో బస్తా సైజ్ 30 కిలోలు ఉండగా, బస్తా ధర 2137 రూపాయల 50 పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ ల జిరాక్స్ తీసుకొని వెళ్లి సమర్పించి విత్తనాలు కొనుగోలు చేయవలిసిందిగా తెలియ జేయడమైనది. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ వాడడం వల్ల పంటలకు మరియు నేల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇవి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో, మట్టిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి మట్టిలోకి తీసుకువెళ్తా యి. తద్వారా తదుపరి పంటకు కావాల్సిన నత్రజని మొక్కలకు అందుతుంది.
మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి, మట్టి జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి.రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ఖర్చు తగ్గిస్తుంది.సేంద్రియ పదార్థం పెరిగి, మట్టి సూత్రధర్మాలు పెరిగి, నీటి నిలువ సామర్ధ్యం పెరుగుతుంది.కొన్నిరకాల హానికర పురుగులను నియంత్రించేందుకు ఉపయోగ పడుతుంది.కావున మండలం లోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version