న్యాల్కల్ దర్గాలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు: హైదరాబాద్ కుషాల్ విజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో జరిగిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.ఈ పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు పైల్వాన్లు తరలివచ్చి తమ సత్తా చాటారు. న్యాల్కల్ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి.మహారాష్ట్ర, హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల మల్లయోధులు పాల్గొన్న ఈ పోటీల్లో, హైదరాబాద్ కు చెందిన కుశాల్, మహారాష్ట్ర ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచారు. విజేత కుశాల్ కు రూ.25,000 నగదు బహుమతితో పాటు శాలువా కప్పి సన్మానించారు. యువత కేరింతల మధ్య జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి, ఉర్సు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
