12క్వింటల్ల బియ్యం పట్టివేత
పరకాల,నేటిధాత్రి
మండలం నాగారంలో రేషన్ బియ్యం దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో సోదాలు చేసి రూ.42 వేల విలువైన 12 క్వింటాళ్ల (26 బస్తాల) పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. జాలిగపు మహేందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని,స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పరకాల పోలీసులకు అప్పగించారు.
